ఉగ్ర నరసింహ స్వామి
స్వరూపంకరీంనగర్ సమీపంలోని కోట్ల నర్సింహులపల్లెలో వెలసిన షోడశబాహు అష్టముఖ ఉగ్ర నరసింహ స్వామి ఆలయం- ఈ క్షేత్రంలో అరుదైన శీమహావిష్ణువు నరసింహ అవతారంలోని అత్యంత ఉగ్రమైన, శక్తివంతమైన స్వరూపం శ్రీ నరసింహ స్వామి స్వరూపం. ఈ క్షేత్రంలో ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న వామనాంకిత సీతారాముల ఆలయంలో లక్ష్మణస్వామి ఆదిశేషుని రూపంలో దర్శనమివ్వడం అరుదైన అంశం.
నృసింహావతారము: ఈ భూమండలం పై దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఎత్తాడని మన పురాణాలు చెబుతాయి. అందులో అత్యంత విచిత్రమైన, విశిష్టమైన రూపం శ్రీ నారసింహ స్వరూపం. సగం మనిషి, సగం సింహం రూపంలో నరసింహుడిగా నరహరి హిరణ్యకశ్యపుని సంహరిస్తాడు. హిరణ్యకశ్యపుని సంహారం తరువాత నరసింహస్వామి అనేక ప్రాంతాల్లో సంచరించాడు. స్వామి సంచరించిన ప్రాంతాలన్నీ స్వయంభువు నరసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. ఉత్తర భారత దేశంలో కంటే దక్షిణ భారత దేశంలోనే ఎక్కువ నరసింహ స్వామి దేవాలయాలు వెలసి ఉన్నాయి.
ఈ క్రమంలో తెలంగాణాలో అతి ప్రాచీనమైన నరసింహ స్వామి క్షేత్రం శ్రీ అష్టముఖ ఉగ్ర నరసింహ స్వామి ఆలయం. అష్టముఖ ఉగ్ర నరసింహ స్వామి ఆలయం ఎక్కడుంది?షోడశబాహు అష్టముఖ ఉగ్ర నరసింహ స్వామి దేవాలయం కరీంనగర్ జిల్లా కోట్ల నర్సింహులపల్లె గ్రామం, గంగాధర మండలంలో వెలసి ఉంది. ఈ దేవాలయం అత్యంత ప్రాచీనమైన, మహిమాన్వితమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందినదని ఆలయ చరిత్ర ద్వారా తెలుస్తోంది.ఆలయ చరిత్ర:గతంలో గంగాధర మండలం ప్రాంతంలో 13వ శతాబ్దపు కాకతీయుల కాలానికి చెందిన సోమనాథ స్వామి, వీరభద్ర స్వామి దేవాలయాలు ఉన్నాయి. అంతకంటే పూర్వం 8వ శతాబ్దానికి చెందిన ప్రసన్న లక్ష్మీ నరసింహ స్వామి మరియు విశ్వనాథ స్వామి ఆలయాలు కూడా ఇక్కడే వెలసి ఉన్నాయి.
ఆలయం పైకప్పుగా పెద్దబండ:ఈ ఆలయం పైకప్పుగా ఉన్న పెద్ద బండపై బయటివైపు ఆకాశం చూస్తూ 16 చేతుల పంచముఖ ఉగ్ర నరసింహ స్వామి వెలసి ఉన్నాడు. ఇక్కడ వెలసిన స్వామి పంచ ముఖాలతో షోడశ భుజాలతో ఉగ్ర నరసింహ స్వామిగా దర్శనమిస్తాడు. స్వామి వారు పదహారు దివ్య భుజాలను కలిగి ఉన్నందున స్వామిని షోడశబాహు అష్టముఖ ఉగ్ర నరసింహ స్వామి అని వ్యవహరిస్తారు. అందుకే ఇది అత్యంత శక్తివంతమైన క్షేత్రంగా విష్ణు పురాణం, బ్రహ్మ పురాణం పేర్కొన్నాయి.
హరిహర క్షేత్రం: ఈ క్షేత్రంలో హరి హరుల ఆలయాలు ఒకే ప్రాంగణంలో వెలసి ఉండటంతో ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని పిలుస్తారు.
చతుర్బాహు అన్నపూర్ణ:ఆలయ ప్రాంగణంలో చతుర్బాహు అన్నపూర్ణ అమ్మవారు, విజయ గణపతి, నందికేశ్వరుడు కొలువై ఉన్నాడు. అలాగే క్షేత్రపాలకుడిగా ప్రసన్న ఆంజనేయ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రం రాష్ట్రకూటుల కాలం నాటిదని శాసనాల ద్వారా తెలుస్తోంది.
పవిత్ర కోనేరు:ఆలయానికి సమీపంలో సహజసిద్ధంగా ఏర్పడిన పవిత్ర కోనేరు ఉంది.
ఆదిశేషునిగా లక్ష్మణస్వామి
ఈ క్షేత్రంలోని విశేషాల్లో అత్యంత అరుదైనది ఏమిటంటే, ప్రధాన ఆలయానికి ఎదురుగా వాయువ్య దిశలో ఉన్న వామనాంకిత సీతారాముల ఆలయంలో లక్ష్మణ స్వామి ఆదిశేషుని రూపంలో దర్శనమివ్వడం. ఒకే రాతిపై చెక్కబడిన ఈ అపూర్వ శిల్పం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు శ్రీరామునిగా అవతార స్వీకారం చేసినప్పుడు ఆయన వెంట ఆదిశేషుడు లక్ష్మణ స్వామిగా భూమిపై అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్షేత్రం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

నరసింహ స్వామి వారి ఆయుధాలు
వైఖానస ఆగమ శాస్తం ప్రకారం ఇక్కడ నరసింహ స్వామి వారు 16 చేతుల్లో శంఖం, చక్రం, కత్తి, శూలం, గద, వజ్రాయుధం వంటి అనేక శక్తివంతమైన ఆయుధాలను ధరించి ఉంటారు. ఈ ఆయుధాలను అత్యంత శిల్పకళా నైపుణ్యంతో చెక్కారు.
ఆదిశంకరులు నడయాడిన పవిత్ర భూమి
ఆది శంకరాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారని చారిత్రక ఆధారాలున్నాయి. ప్రతి నెల పౌర్ణమి అర్ధరాత్రి సమయంలో నాగదేవత స్వామివారిని దర్శించడానికి వస్తుందని భక్తులు నమ్ముతారు.
సంతాన ప్రదాత
షోడశబాహు అష్టముఖ ఉగ్ర నరసింహ స్వామివారిని సంతానం లేని దంపతులు దర్శించి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని విశ్వాసం. అదే విధంగా పెళ్లి కాని వారు, పెళ్లి ఆలస్యం అవుతున్న వారు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే త్వరలో వివాహం జరుగుతుందని విశ్వాసం. భక్తులు కోరిన కోరికలు నెరవేరితే వెండి నామాలను, వెండి మీసాలను స్వామివారి హుండీలో వేసే ఆచారం కూడా ఇక్కడ ఉంది.
గ్రహదోష నివారణ
ఇక్కడ ఆదిశేషుని రూపంలో వెలసిన లక్ష్మణ స్వామిని దర్శించి పూజిస్తే సమస్త గ్రహ దోషాలు తొలగుతాయని విశ్వాసం. అందుకే శని గ్రహ, కుజ దోష నివారణకు, వివాహ ప్రాప్తికి, సంతాన భాగ్యానికి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
పూజోత్సవాలు
ఈ క్షేత్రంలో పంచరాత్ర ఆగమ సంప్రదాయం ప్రకారం నిత్యారాధనలు జరుగుతాయి. ప్రతి స్వాతి నక్షత్రం నాడు శ్రీ నరసింహ స్వామివారికి, పునర్వసు నక్షత్రం నాడు శ్రీ సీతారాముల వారికి తిరుమంజన సేవలు నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి నుంచి మÖడు రోజుల పాటు వైభవంగా బ్ర ్మత్సవాలు జరుగుతాయి. ఈ అరుదైన, మహిమాన్వితమైన నరసింహ క్షేత్రాన్ని ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా తప్పక చూడాల్సిందే!
ఎలా చేరుకోవాలి?
కరీంనగర్ నగరం నుంచి సుమారు 30 కి.మీ. దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కరీంనగర్ నుంచి బస్సు సౌకర్యాలున్నాయి. మనం కూడా ఈ అరుదైన క్షేత్రాన్ని దర్శించి అభీష్టసిద్ధిని పొందుదాం.
ఓం నమో నారసింహాయ నమః