హైదరాబాద్:మెట్రో న్యూస్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ నిర్మల జగ్గారెడ్డి దంపతుల కుమారుడు భరత్ సాయి రెడ్డి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది కుటుంబ సభ్యులు, సన్నిహితులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.


హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఈవెంటారా కన్వెన్షన్ వేదికగా నిశ్చితార్థ కార్యక్రమం జరిగింది
జగ్గారెడ్డి కుటుంబానికి రాజకీయ, సామాజిక వర్గాల్లో ఉన్న పరిచయాల నేపథ్యంలో ఈ నిశ్చితార్థ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ మిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మెట్రో ఈవినింగ్స్ ఎండీ దేవరకొండ కాళిదాసు, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధకృష్ణ, ఎన్ టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి తదితరులు పాల్గొన్నారు.